రజనీ ని చూసి భయపడ్డ మహేష్, అల్లు అర్జున్..

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' విడుదల తేదీలో మార్పు జరిగింది.

ఆ వివరాల్లోకి వెళితే, ముందు ప్రకటించినట్టుగా ఏప్రిల్ 27న కాకుండా ఒక్కరోజు ముందుగా అంటే ఏప్రిల్ 26న విడుదలయ్యేలా ఉందంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదంతా జరగడానికి కారణం రజినీకాంత్ కాలా చిత్రం ఏప్రిల్ 27న విడుదలకానుండడమే.

ఇక ఇదిలావుండగా మహేష్ బాబు 'భరత్ అనే నేను' చిత్రం కూడా ఒకరోజు ముందుగా అంటే ఏప్రిల్ 26న విడుదల చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన కూడా ఇప్పుడే వెలువడింది. దీనికి కూడా కారణం రజినీకాంత్ ‘కాలా’ అని వేరే చెప్పకర్లేదు.

మొత్తంగా స్టైలిష్ స్టార్-సూపర్ స్టార్ లు తమిళ సూపర్ స్టార్ చిత్రంతో పోటీ ఎందుకు అని ముందురోజే రావడానికి సిద్ధం అయ్యారు. మరి ఈ రెండు ఒక రోజే విడుదల అవుతాయా లేక ఏదైనా ఒకటి వాయిదా పడుతుందా అనేది చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS