అమీ తుమీ సెన్సార్ రిపోర్ట్

మరిన్ని వార్తలు

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ "అమీ తుమీ". వెన్నెలకిషోర్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని "యు" సర్టిఫికెట్ అందుకొంది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.  

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. "మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన బాణీలన్నీ శ్రోతలను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభిస్తోంది. ఇంద్రగంటి గారు హిలేరియస్ ఎంటర్ టైనర్ గా "అమీ తుమీ" చిత్రాన్ని తెరకెక్కించారు. అవసరాల-అడివి శేష్ ల క్యారెక్టర్, వెన్నెల కిషోర్ నెగిటివ్ షేడ్ లో పండించే కామెడీ సినిమాకి హైలైట్ గా నిలిస్తుంది. అదితి మ్యాకల్-ఈషాల పాత్రలు జనాల్ని హిలేరియస్ గా నవ్విస్తాయి. ఇక తనికెళ్లభరణి గారి పాత్ర ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు" అన్నారు

-ప్రెస్ రిలీజ్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS