రంగమ్మత్తా.. ఏకి పారేస్తున్నారెట్టా!

మరిన్ని వార్తలు

'రంగమ్మత్త' పాత్రలో అనసూయ అదిరిపోయింది. 'క్షణం', 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రాల్లో నటించి, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, 'రంగస్థలం' సినిమాలో నటిస్తోందనగానే చాలా క్యూరియాసిటీ క్రియేట్‌ అయ్యింది. అనసూయ ఒప్పుకుందంటే ఆ పాత్రకి సినిమాలో చాలా ప్రాధాన్యత వున్నట్లేనని అంతా అనుకున్నారు. 

పాత్ర సంగతేమోగానీ, గెటప్‌ మాత్రం అదిరిపోయింది. సినిమాలో ఆమె పాత్ర ఎలా వుంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే, సోషల్‌ మీడియాలో 'రంగమ్మత్త' ఫుల్‌ కటౌట్‌ విడుదలవడంతో, ఒక్కసారిగా ట్రాలర్స్‌ రెచ్చిపోయారు. అసలే ఇంటర్నెట్‌లో అనసూయకి ఈ ట్రాలర్స్‌ చాలా చాలా ఎక్కువ. 'అర్జున్‌రెడ్డి' సినిమా టైమ్‌లో అనసూయ చేసిన కామెంట్లే అందుక్కారణం. ఇటీవల ఓ వివాదం అనసూయని ఇంకా బాగా ఇబ్బంది పెట్టేసింది. సెల్ఫీ కోసం వచ్చిన ఓ చిన్న కుర్రాడి ఫోన్‌ని అనసూయ పగలగొట్టిందంటూ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదవడంతో రెచ్చిపోయిన ట్రాలర్లు, అనసూయని సోషల్‌ మీడియా నుంచి 'తరిమేశారు'. 

నిజమే, ట్రాలర్స్‌ దెబ్బ తట్టుకోలేక అనసూయ పారిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి అనసూయ, 'రంగమ్మత్త' ఫొటోతో సోషల్‌ మీడియాలో రీ-ఎంట్రీ ఇచ్చింది. అంతే క్షణాల్లో ఆమె ఫొటో వైరల్‌ అవడమే కాదు, వందల్లో లైక్‌లు, వేలల్లో కామెంట్లు వచ్చి పడ్డాయి. నూటికి 99 కామెంట్లు నెగెటివ్‌గానే రావడంతో ఇంకోసారి అనసూయ సోషల్‌ మీడియాకి గుడ్‌ బై చెప్పేస్తుందేమోనని అంతా అనుకుంటున్నారు. అయినా అనసూయ ఎందుకు పారిపోవాలి? పారిపోవడమంటే, తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్టేనేమో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS