అనిల్ కపూర్-మాధురీ దీక్షిత్ ల జంట 90లలో బాలీవుడ్ నందు హిట్ పెయిర్ గా పేరు గడించింది. అయితే తరువాతి కాలంలో మాధురి సినిమాల నుండి విరామం తీసుకోగా అనిల్ కపూర్ కూడా హీరో పాత్రలు చేయడం ఆపేశాడు.
ఇక ఇప్పుడు మళ్ళీ వారు జంటగా ఒక చిత్రం చేయనున్నారు. ఆ చిత్రం పేరు ‘టోటల్ ధమాల్’. ధమాల్, డబల్ ధమాల్ చిత్రాలకి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో వీరు ప్రధాన పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
అయితే 2000 సంవత్సరంలో వీరు ఆఖరిగా నటించిన పుఖార్ చిత్రం విడుదల అయింది. ఇప్పుడు 17 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇద్దరు కలుస్తున్నారు. మొత్తానికి దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఈ జంటని వెండితెరపై ప్రేక్షకులు చూడనున్నారు.