అనుపమా అదరగొట్టేసింది

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్‌ ఇప్పటికే నటిగా నిరూపించేసుకుంది. క్యూట్‌ గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌ టాలెంట్‌ కూడా ఉంది ఈ ముద్దుగుమ్మకి. అందుకే ఆ యాక్టింగ్‌తోనే అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది. ఈ ఏడాది 'శతమానం భవతి' సినిమాతో మంచి హిట్‌ అందుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాలో నటిస్తోంది. రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. రామ్‌తో 'నేను శైలజ' సినిమాని తెరకెక్కించిన కిషోర్‌ తిరుమల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి మంచి టాక్‌ వస్తోంది. టీజర్‌, ట్రైలర్లకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ ఆకట్టుకుంటోంది. ప్రేమ, స్నేహం గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల. కాగా ఈ సినిమాలో అనుపమతో పాటు లావణ్య త్రిపాఠి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. అయినా అనుపమా పరమేశ్వరన్‌ పాత్ర కీలకమైనది ఈ సినిమాకి. డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల, హీరో రామ్‌, ముద్దుగుమ్మ అనుపమని తెగ పొగిడేస్తున్నారట. అంత బాగా నటించిందట ఈ చిత్రంలో అనుపమ. ఆమెది వెరీ వెరీ ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌. ఇప్పటికే నటనలో తనేంటో నిరూపించేసుకుంది. అయితే ఈ సినిమాలో అనుపమ కెరీర్‌ బెస్ట్‌ పర్‌ఫామెన్స్‌ ఇచ్చిందట. క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేసేసిందట. ఈ సినిమాతో అనుపమకి మరింత మంచి గుర్తింపు దక్కుతుందంటోంది చిత్ర యూనిట్‌. శ్రీవిష్ణు మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ నెల 27న 'ఉన్నది ఒక్కటే జిందగీ' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS