బోయపాటి శ్రీను - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తోన్న సినిమాలో కేథరీన్ ఐటమ్ సాంగ్ చేస్తోన్న సంగతి తెలిసినదే కదా. ఈ బ్యూటీకి ఐటమ్ సాంగ్ కోసం 45 లక్షలకు పైగానే చెల్లించారనే టాక్ సినీ వర్గాల్లో అందరూ షాక్ అయ్యేలా చేసింది. 'ఖైదీ నెంబర్ 150' సినిమా కోసం ముందుగా ఈ బ్యూటీని ఐటమ్ సాంగ్కి అనుకున్నారుగానీ, అనూహ్యంగా ఆ ఛాన్స్ లక్ష్మీరాయ్ తన్నుకుపోయింది. అయితే 'సరైనోడు' సినిమాలో హీరోయిన్గా చేసిన ఈ బ్యూటీని లక్కీ గాళ్గా భావించి బోయపాటి, తన తదుపరి సినిమా కోసం ఐటమ్ గర్ల్గా తీసుకున్నాడట. అంతకు ముందు బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో తమన్నా రెండు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది. ఒక్కో పాట కోసం అప్పట్లో 40 లక్షల దాకా తమన్నా తీసుకుందనే గాసిప్స్ వినవచ్చాయి. తమన్నాని మించి కేథరీన్కి రెమ్యునరేషన్ ఇవ్వడంతో ఈ అంశం గురించి ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు టాలీవుడ్లో. హీరోయిన్గా కూడా కేథరీన్కి అంత రెమ్యునరేషన్ పలకడం లేదని సమాచారమ్. అయితే తన సినిమాలు చాలా గ్రాండ్గా ఉండాలని కోరుకునే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అలాగే, దర్శకుడు బోయపాటి కేథరీన్ రెమ్యునరేషన్ విషయంలో కూడా రాజీ పడకపోవడం ఆమెకు కలిసొచ్చిందనుకోవాలి. ఇంకో వైపున డాన్సుల్లోనూ స్టైలింగ్లోనూ కేథరీన్ కెవ్వు కేక అంతే.