అన్నయ్యకి విషెస్‌ చెప్పిన పవన్‌

మరిన్ని వార్తలు

చిరంజీవి రీ ఎంట్రీలో వస్తోన్న సినిమా 'ఖైదీ నెంబర్‌ 150' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఈ రోజు గుంటూరులో జరగబోతోంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ వేడుకకు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చీఫ్‌ గెస్ట్‌గా రానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ లోగా అన్నయ్య రీ ఎంట్రీలో వస్తోన్న ఈ సినిమా విజయవంతం కావాలని ఆశిస్తూ అన్నయ్యకి బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తూ పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్‌ చాలా సంతోషపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం 'కాటమరాయుడు' సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. సో సమయానికి ఈ ఫంక్షన్‌కి హాజరు కావడం అవుతుందో లేదో తెలీదు. కానీ తన విషెస్‌ని మాత్రం ముందుగా పంపించాడు. అన్నదమ్ముల మధ్య తగాదాలున్నాయంటూ భావించే వ్యక్తులకి, చక్కర్లు కొట్టే గాసిప్స్‌కి ఈ మెసేజ్‌ ఓ సమాధానం కానుందనే చెప్పొచ్చు. ఈ ఫంక్షన్‌కి గుంటూరులోని హాయ్‌లాండ్‌ వేదిక అయ్యింది. వేలాది మంది అభిమానులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఈ వేడుకకి హాజరవుతారనే ఉద్దేశ్యంతో భారీగా ఏర్పాట్లు చేశారు. మెగాస్టార్‌ కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. రైతు సమస్యల నేపధ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి వినాయక్‌ దర్శకుడు కాగా, రామ్‌ చరణ్‌ నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS