'జై సింహా' నిర్మాతపై ఐటీ దాడులు

మరిన్ని వార్తలు

ఓ పెద్ద సినిమా విడుదలవుతోందంటే ఆ సినిమాపై ఐటీ దాడులు జరగడం టాలీవుడ్‌లో సర్వ సాధారణమే. సినీ పరిశ్రమలపై ఐటీ వేధింపులు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ మధ్య ఈ గందరగోళం కొద్దిగా సద్దుమనిగినట్లే అనిపించింది. అయితే తాజాగా ఐటీ అధికారులు 'జై సింహా' సినిమా నిర్మాత సి.కళ్యాణ్‌ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. 

ఈ విషయంపై స్పందించిన నిర్మాత సి. కళ్యాణ్‌ తమపై దాడులు జరగలేదనీ, ఐటీ అధికారులు కేవలం టీడీఎస్‌ వివరాలు సేకరించారనీ తెలిపారు. కార్యాలయ సిబ్బంది అధికారులకు పూర్తిగా సహకరించారనీ తెలిపారు. సి.కళ్యాణ్‌తో పాటు మరికొంతమంది నిర్మాతలపై కూడా ఐటీ దాడులు జరిగినట్లు సమాచారమ్‌. మరో పక్క సి. కళ్యాణ్‌ తాజాగా వినాయక్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలో. ఈ సినిమా బడ్జెట్‌ విషయంలోనూ ఐటీ అధికారులు ఆరా తీశారట. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

గతంలో 'బాహుబలి' సినిమా రిలీజ్‌ టైంలోనూ ఇలాగే ఐటీ దాడులు జరిగాయి. చాలా సినిమాలు ఐటీ దాడుల కారణంగా రిలీజ్‌కి ముందే టెన్షన్‌ పడిన సందర్భాలున్నాయి కూడా. తాజాగా 'జై సింహా' విషయం వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార , నటాషాదోషి, హరిప్రియ హీరోయిన్లుగా నటించారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS