100 కోట్ల క్లబ్ లో జై లవకుశ?!

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో అందరిని ఆకట్టుకున్న జై లవకుశ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్నది. విడుదల అయిన మూడురోజుల్లోనే ఇది తారక్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది.

అందుతున్న లెక్కల ప్రకారం, ఈ చిత్రం విడుదలైన మూడురోజుల్లో రూ 75 కోట్ల గ్రాస్ వసూలు చేయగలిగింది. అలాగే నాలుగవ రోజైన ఈరోజు ఆదివారం కావడంతో కచ్చితంగా ఈరోజు రూ100 కోట్ల మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నట్టు ట్రేడ్ వర్గాల అంచనా.

ఇదే గనుక జరిగితే ఎన్టీఆర్ తన స్తమినాని బాక్స్ ఆఫీస్ వద్ద చూపెట్టినవాడు అవుతాడు. ఇక ఇంకొక మూడురోజుల వరకు పెద్ద చిత్రాల విడుదల లేకపోవడంతో జై లవకుశకి బాక్స్ ఆఫీస్ వద్ద అడ్డంకులు లేవు అన్నది స్పష్టంగా తెలుస్తున్నది.

ఇంకొక్క రోజులో జై లవకుశ రూ 100కోట్ల క్లబ్ లో చూడబోతున్నాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS