సినీ ప్రముఖులకు కెసీఆర్ భరోసా?!

మరిన్ని వార్తలు

డ్రగ్స్ రాకెట్ లో సిట్ విచారణ ఎదురుకుంటున్న టాలీవుడ్ ప్రముఖులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తీపీ కబురు చెప్పారనే అనుకోవాలి. 

వివరాల్లోకి వెళితే, కొద్దిసేపటి క్రితం ఈ డ్రగ్స్ రాకెట్ విషయమై సంబంధిత అధికారులతో సమావేశమయిన ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ కేసులో సినీ ప్రముఖులని దోషులుగా కాకుండా భాధితులు గానే చూడండి అని అధికారులతో చర్చించినట్టు సమాచారం.

ఈ విషయం ఒకరకంగా సినీ ప్రముఖులకి పెద్ద రిలీఫ్ గానే చూడొచ్చు. ఇప్పటికే SIT విచారణకి హాజరవుతున్న వారు అలాగే మరికొంతమంది సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా దిగులు చెందుతున్న ఈ సమయంలో ఈ వార్త సంచలనం రేపుతున్నది.

మరి ఈ వార్త తరువాత  ఈ కేసులో ఎలాంటి మార్పులు జరగనున్నాయో వేచి చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS