'సావిత్రి' కోసం శైలజ ఏమంటుందో!

మరిన్ని వార్తలు

ఎప్పట్నుంచో మహానటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా సినిమా రాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఫేం నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేయాలనుకుంటున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే మహానటి సావిత్రి పాత్రలో నటించి మెప్పించగల ముద్దుగుమ్మ ఎవరన్నది సస్పెన్స్‌గా ఉంది. మొదట్లో ఈ పాత్ర కోసం నిత్యామీనన్‌ని అనుకున్నారు. నిజమే నిత్యా అయితేనే బాగుంటుంది. అంత గొప్ప నటి పాత్రను మెప్పించాలంటే నిత్య వంటి యాక్టింగ్‌ టాలెంట్‌ ఉన్న భామే సరైన ఎంపిక అనుకున్నారు. కానీ స్టార్‌ డమ్‌ విషయానికొస్తే ఆ ప్లేస్‌ సమంతకిస్తే బావుంటుందని అనుకున్నారు కూడా. అయితే ఇప్పుడు నిత్యా కాదు, సమంత కాదు 'నేను శైలజ' ఫేం కీర్తి సురేష్‌ని పరిశీలిస్తున్నారన్న గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. యాక్టింగ్‌ టాలెంట్‌ విషయంలో కీర్తి సురేష్‌కి కూడా మంచి పేరు ఉంది. అయితే ఇది నిజమా కాదా అనే విషయానికొస్తే, ఏదైనా గాసిప్‌ వస్తే కీర్తి సురేష్‌ ముందుగా స్పందిస్తుంది. ఆ విషయంపై క్లారిటీ ఇస్తుంది. పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో కీర్తి సురేష్‌ నటిస్తోందన్న గాసిప్‌ రాగానే వెంటనే ఆ విషయంలో స్పందించింది ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. అలాగే ఈ విషయానికొచ్చేసరికి ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదు. కానీ ఈ పాత్ర కోసం ఆమెనే ఎంపిక చేయనున్నారు అనే మాట హాట్‌ టాపిక్‌ అయ్యింది. 'సావిత్రి' వంటి గొప్ప సినిమాలో నటించే అదృష్టం రావాలే కానీ ఈ ముద్దుగుమ్మ ఎందుకు వదులుకుంటుంది చెప్పండి. చూద్దాం ఏం జరుగుతుందో! 


 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS