శ్రీదేవి స్థానంలో మాధురీ

మరిన్ని వార్తలు

శ్రీదేవి అకాలమరణంతో ఆమె నటించడానికి సిద్ధం అయిన సినిమాలు కూడా నిరవధికంగా ఆగిపోయాయి. ఇక అలాంటి ఒక చిత్రంలో ఇప్పుడు మరొక హీరోయిన్ నటించడానికి ఒప్పుకుంది.

ఆ వివరాల్లోకి వెళితే- కరణ్ జోహార్ నిర్మాణంలో ఒక మల్టీ స్టారర్ చిత్రంలో హీరో సంజయ్ దత్ పక్కన నటించడానికి శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రం ఆమె ఒప్పుకోవడానికి కారణం ఆ చిత్ర కథ తనకెంతో నచ్చడమే అన్నది ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యులు చెప్పిన మాట.

ఇక ఈ తరుణంలో కరణ్ జోహార్ చొరవతో అలాగే ఆ కథ బాగా నచ్చడంతో మరో నటి మాధురి దీక్షిత్ ఈ చిత్రం చేయడానికి ఒప్పుకుంది. దీనితో శ్రీదేవి మరణంతో ఈ చిత్రం ఆగిపోయింది అని అనుకున్న వారందరికీ ఇది శుభవార్త అనే చెప్పాలి.

ఈ సందర్భంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్న మాధురికి తమ కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపింది. దీనితో శ్రీదేవి చేయాలనుకున్న పాత్రలో మాధురీ కనపనుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS