మంచు విష్ణు-మోహన్ బాబులకి హాలీవుడ్ డైరెక్టర్ కావాలట

మరిన్ని వార్తలు

మంచు కుటుంబం నుండి వస్తున్న తాజా చిత్రం గాయత్రి. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా మోహన్ బాబు తాను నిర్మించబోయే కొత్త చిత్రం గురించి కొన్ని వివరాలు తెలియచేశారు.

అవేంటంటే- మంచు విష్ణు కథానాయకుడిగా భక్త కన్నప్ప చిత్రాన్ని నిర్మించనున్నారట. ఇక దీని కోసం సుమారు రూ 70కోట్ల మేర బడ్జెట్ ని కూడా ఫిక్స్ చేసినట్టుగా తెలిపారు. అయితే ఈ సినిమాని ఇప్పటి సాంకేతికత జోడించి తెరకెక్కించనున్నారట.

అందుకోసమే ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించడానికి ఒక హాలీవుడ్ డైరెక్టర్ ని తీసుకురానున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆ దర్శకుడు కోసం అన్వేషణ జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఈ హాలీవుడ్ దర్శకుడు ఎవరా అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మొత్తానికి మంచు విష్ణు కుటుంబం ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తున్నది. అలాగే మంచు విష్ణు నటనకి కూడా ఈ చిత్రం ఒక పరీక్ష కాబోతుంది అన్నది నిజం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS