అడ్డా మూవీ ఫేం కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు కొత్త చిత్రానికి ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు.
అందుతున్న సమాచారం ప్రకారం, ఓటరు అనే పవర్ ఫుల్ టైటిల్ ని మంచు విష్ణు సినిమాకి పెట్టనున్నట్టు తెలుస్తుంది. కథకు చక్కగా సరిపోయే టైటిల్ ఇది అని యూనిట్ వర్గాలు చెబుతున్నారు.
మియా జార్జ్, సురభి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. ఇప్పటికే విష్ణు ఆచారి అమెరికా యాత్ర అనే ఇంటరెస్టింగ్ టైటిల్ అనౌన్స్ చేశాడు.
మొత్తానికి ఆసక్తికర టైటిల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిన విష్ణు.