ఈరోజు 5.30కి ముహూర్తం పెట్టిన పవన్ కళ్యాణ్

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు హైదరాబాద్ లోని తెలుగు ఫిలిం చాంబర్ లో ఆయన కుటుంబంలోని ప్రముఖ హీరోలందరితో కలిసి కొద్దిసేపు హల్చల్ చేశాడు. 

అయితే ఇదంతా తనని విమర్శల పాలు చేయడానికి తన తల్లిని దూషించడమేంటి అని  ప్రశ్నిస్తూ ఆయన నిన్న రాత్రి నుండి ట్వీట్లు పెడుతున్నాడు. ఇక ఈరోజు ఫిలిం చాంబర్ లో కూడా నిరసన వ్యక్తం చేయడానికి వచ్చాడు. ఇక దీనికి మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ సహా మెగా బ్రదర్ నాగబాబు కూడా వచ్చారు. 

పవన్ కళ్యాణ్ చాలా కోపంగా ఉన్నట్టు ఫిలిం చాంబర్ లో ఆయన ఉన్నప్పుడు సన్నివేశాలు చూస్తే మనకి అర్ధమవుతుంది. అయితే ఈ తరుణంలో ఇంకొక గంటలో అనగా 5.30కి మెగా ఫ్యామిలీ నుండి లేదా పవన్ కళ్యాణ్ నుండి ఒక కీలక ప్రకటన వెలువడనుంది అన్న ఒక అనదికారక వార్త ప్రచారంలో ఉంది. మరి ఆ ప్రకటన ఎమై ఉంటుందో అన్నది వేచి చూడాలి.

చూద్దాం.. పవన్ & కో ఎటువంటి సంచలనాలకి తెరలేపనున్నారో..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS