పవన్-చంద్రబాబు మధ్య మాటల్లేవ్

మరిన్ని వార్తలు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయినట్టుగానే కనిపిస్తుంది. కారణం ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ అక్కడ తన పక్కనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట కలపకపోవడమే...

 

పూర్తి వివరాల్లోకి వెళితే, విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న దేవాలయంలో 11అడుగుల వెంకటేశ్వరా స్వామీ విగ్రహం ప్రతిష్ఠ   సందర్భంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంకా పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ పక్క పక్కనే ఉన్నప్పట్టికి ఒకరితో ఒకరు మాటల్లేకుండానే ఉన్నారు.

అయితే కొద్దిసేపటి తరువాత అక్కడి నుండి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారు, కనీసం వెళ్ళిపోయే సమయంలో కూడా వారి మధ్య ఎటువంటి చర్చ జరగలేదు అనే చెప్పాలి. దీనంతటికి ఈ మధ్యకాలంలో చంద్రబాబు ఆయన ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తుండడమే.

 

ఏదేమైనా.. వీరిరువురి వ్యవహారం చూస్తుంటే 2019 ఎన్నికల పోరు రసవత్తరంగా మారే అవకాశం లేకపోలేదు అన్న అభిప్రాయం ఏర్పడుతున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS