పవన్ అభిమానుల పై పోలీసుల లాఠీఛార్జి!

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ కొత్త చిత్రం కాటమరాయుడు రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లో నేటి తెల్లవారుజామున జరిగిన ఒక సంఘటన అందరినీ తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.

వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ లోని భ్రమరాంబ ధియేటర్ దగ్గర పవన్ అభిమానుల పై పోలీసులు లాఠీఛార్జి చేశారు. సదరు ధియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో పేరుతో టిక్కెట్లని రూ 3000/- కి తగ్గకుండా అమ్మేశారు.

అయితే ఆ థియేటరులో కాటమరాయుడు ప్రదర్శించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అభిమానులు ఆందోళనకి దిగారు. దీనితో అల్లరిమూకలని చెదరగొట్టే ప్రయత్నంగా లాఠీఛార్జి చేశారు.

ఇంతకీ అభిమానులకి మాత్రం ఆ డబ్బులు ఇంతవరకు వెనక్కి తిరిగి ఇవ్వకపోవడం గమనార్హం. ఇది గమనించిన వారు మాత్రం, డబ్బులు పోయే దెబ్బలు మిగిలే అనేలా అయింది అభిమానుల పరిస్థితి అని నిట్టూర్పు విడుస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS