ప్రభాస్‌తో పూజా హెగ్దే రొమాంటిక్‌ టచ్‌!

మరిన్ని వార్తలు

హాట్‌ బ్యూటీ పూజా హెగ్దే, టాలీవుడ్‌లో ఇప్పుడు హాటెస్ట్‌ ప్రాపర్టీగా కితాబులందుకుంటోంది. వరుస అవకాశాలు దక్కించుకుంటోన్న పూజా హెగ్దే, లేటెస్ట్‌గా ప్రభాస్‌ సరసన ఛాన్స్‌ అందుకున్న సంగతి తెల్సిందే. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించనుందని ఇప్పటికే అధికారికంగా అనౌన్స్‌ అయ్యింది. 

అయితే, ఈ సినిమా ప్రభాస్‌ తాజా మూవీ 'సాహో' తర్వాతే సెట్స్‌ మీదకు వెళుతుందని అంతా అనుకున్నారు. కానీ, తాజా అప్‌డేట్‌ ఏంటంటే, 'సాహో' కంటే ముందే, ప్రభాస్‌ - పూజ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందట. 'బాహుబలి' రిలీజ్‌ తర్వాత 'సాహో' పట్టాలెక్కి ఏడాది గడుస్తున్నా, ఇంకా 'సాహో' ఓ కొలిక్కి రాలేదు. ముందు అనుకున్న సబ్జెక్ట్‌కి చాలా మార్పులు చేసి, 'బాహుబలి' స్థాయిలో అత్యంత భారీ హంగులతో 'సాహో'ని తెరకెక్కిస్తుండడమే ఇందుకు కారణం. 

'సాహో' పూర్తవడానికి ఇంకా చాలా టైమ్‌ పడుతుందనీ, ఈలోగా ఓ మూడు నాలుగు నెలలు కేటాయిస్తే, రాధాకృష్ణకుమార్‌ సినిమా షూటింగ్‌ పూర్తి చేసేయ్యొచ్చనే నిర్ణయానికి ప్రభాస్‌ వచ్చాడట. త్వరలో సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళనుందనీ, 'సాహో' కంటే నాలుగైదు నెలల ముందే ఈ సినిమా వచ్చేస్తుందనీ తెలుస్తోంది. 

ఈ సినిమా ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ అని తెలుస్తోంది. ప్రభాస్‌ - పూజా హెగ్దే కాంబినేషన్‌లో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ అంటే ఆ కిక్కే వేరప్పా! 'డార్లింగ్‌' ప్రభాస్‌తో, హాట్‌ బ్యూటీ పూజా హెగ్దే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ అదరగొట్టేస్తుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS