భ్రమరాంబ మేనియా

మరిన్ని వార్తలు

సాధారణంగా ఓ కొత్త సినిమా విడుదలవుతోందంటే ఆ సినిమా హీరో గురించి మాట్లాడుకోవడం పరిపాటి. కానీ 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాలో హీరోయిన్‌ గురించి మాట్లాడుకోవల్సి వస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ ముద్దుగుమ్మ నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ రేంజ్‌లో ఉన్నప్పటికీ, యంగ్‌ హీరోలతో కూడా జత కట్టేందుకు ఏమాత్రం వెనుకాడదు. అందులోనూ ఈ సినిమాలో రకుల్‌ పర్‌ఫామెన్స్‌ ముందు మిగిలిన ఆర్టిస్టులంతా చిన్నబోవాల్సిందే అంటున్నారు. అంత ప్రాధాన్యత క్యారెక్టర్‌ అట ఈ సినిమాలో రకుల్‌ది. 'భ్రమరాంబ' అనే పేరులోనే ఉంది ఆ పవర్‌. భ్రమరాంబ పాత్రను ఈ సినిమాలో తీర్చి దిద్దిన విధానం చాలా బాగుంటుందట. నాగ చైతన్య భ్రమరాంబకి నచ్చడం అంటే గొప్ప విషయం కాదు కదా. అందుకే ఆనందంతో చిందేస్తూ మనోడు పాటేస్కున్నాడు కూడా 'భ్రమరాంబకి నచ్చేశాను.. ' అంటూ. ఇప్పటికే పోస్టర్‌ స్టిల్స్‌ ద్వారా రకుల్‌ బోలెడన్ని మార్కులేయించేసుకుంటోంది. ఇక సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని మార్కులు కొట్టేస్తుందో. ట్రెడిషనల్‌ లుక్‌లో అదరగొట్టేస్తోంది. క్యూట్‌గా కనిపిస్తూనే కవ్విస్తోంది తన అందంతో రకుల్‌. అందుకే నాగార్జున రకుల్‌ని అలనాటి మేటి నటి శ్రీదేవితో పోల్చేశారు. అప్పుడు శ్రీదేవి, ఇప్పుడు రకుల్‌ అని నాగార్జున స్వీట్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చేశారు. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరో పక్క రకుల్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో 'స్పైడర్‌' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ సినిమా ఆగష్టులో విడుదల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS