రారండోయ్‌'లో ఆ డైలాగ్‌ తీసేస్తారా?

మరిన్ని వార్తలు

ఒక డైలాగ్‌ తెచ్చి పెట్టిన జోష్‌ ఇంత వివాదానికి కారణం అవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. నాగచైతన్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరకెక్కుతోన్న సినిమా 'రారండోయ్‌ వేడుక చూద్దాం..'. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌లో చలపతిరావు మహిళలపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఈ సినిమాలో టీజర్‌లో నాగ చైతన్య అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం.. అన్న మాట సినిమాలో సిట్యువేషనల్‌గా వచ్చినా, కానీ.. బహిరంగ వేదికపై ఆ డైలాగ్‌కి చలపతిరావు చేసిన వ్యాఖ్యను ఎవ్వరూ సమర్ధించలేకపోతున్నారు. మహిళా సంఘాలకు ఈ విషయంపై కోపం కట్టలు తెంచుకుని వచ్చింది. దాంతో చలపతిరావుపై కేసు నమోదు చేశారు. అందుకు ఆయన మీడియా ముఖంగా క్షమాపణలు కూడా తెలిపారు. కానీ ఈ డైలాగ్‌ తెచ్చిన రగడతో సినిమాలో ఈ డైలాగ్‌ని ఉంచాలా వద్దా అనే సందిగ్ధంలో పడింది చిత్ర యూనిట్‌. సినిమా క్లీన్‌ సినిమా కాబట్టి, ఇలాంటి వివాదాలు ఎందుకు కొని తెచ్చుకోవడం అనే ఉద్దేశ్యంతో నాగార్జున ఈ డైలాగ్‌ని సినిమా నుండి తొలగించాలని భావిస్తున్నారట. అసభ్యంగా మాట్లాడిన చలపతిరావు మీదే కాకుండా, సినిమాలో ఈ డైలాగ్‌ చెప్పిన నాగ చైతన్యపై కూడా మహిళా సంఘాలు గుర్రుమంటున్నాయి. ఈ డైలాగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ సినిమాలో ఈ డైలాగ్‌ని తొలగించడమే సబబు అని అందరూ భావిస్తున్నారు. కళ్యాన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS