సంక్రాంతి బరిలో మాస్‌ మహరాజా

మరిన్ని వార్తలు

దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత బుల్లెట్‌ స్పీడుతో రీ ఎంట్రీ ఇచ్చాడు మాస్‌ మహరాజ్‌ రవితేజ. ఏమాత్రం తగ్గని ఎనర్జీతో, మునుసటి ఉత్సాహాన్ని మించిన ఉత్సాహంతో బరిలోకి దూసుకొచ్చాడు. వస్తూ వస్తూనే రెండు సినిమాలను అనౌన్స్‌ చేయడం, ఓ సినిమాని పూర్తి చేయడం, విడుదల చేయడం కూడా టకటకా జరిగిపోయాయి. ఇటీవలే 'రాజా ది గ్రేట్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ మంచి విజయాన్ని అందుకున్నాడు. అనిల్‌ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 

కాగా ఇప్పుడు మరో సినిమాని పూర్తి చేసేస్తున్నాడు మాస్‌ రాజా. అదే విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'టచ్‌ చేసి చూడు'. రాశీఖన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుందట. సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. సంక్రాంతి బరిలో ఇప్పటికే స్టార్‌ హీరోలైన బాలయ్య, పవన్‌ కళ్యాన్‌ ఉన్నారు. బాలయ్య 'జై సింహా', పవన్‌ కళ్యాణ్  'అజ్ఞాతవాసి' సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. అయితే తాజాగా ఈ లిస్టులోకి మాస్‌ రాజా రవితేజ కూడా వచ్చి చేరాడు. 

కథపై ఉన్న నమ్మకంతోనే ఈ సినిమాని సంక్రాంతి బరిలో ఉంచామని చిత్ర యూనిట్‌ చెబుతోంది. మంచి కథల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా ఆయా సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే ఈ సినిమా స్టోరీ విషయంలోనూ చిత్ర యూనిట్‌ ఫుల్‌ కాన్ఫిడెంట్‌గా ఉందట. ఎలాగూ రవితేజ సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ కారణాలతోనే 'టచ్‌ చేసి చూడు' సంక్రాంతి బరిలో విజయాన్ని టచ్‌ చేసేందుకు అందంగా ముస్తాబైపోతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS