చేనేత వస్త్రాల్ని ప్రమోట్ చేసేందుకుగాను ఓ ఫ్యాషన్ షో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణలో చేనేతకు సమంత బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్న సంగతి తెలిసినదే కదా! అందుకే ఈ షో కోసం సమంత చాలా కేర్ తీసుకుంది. సన్నిహితుల్ని సోషల్ మీడియా ద్వారా చేనేతకు మద్దతివ్వాల్సిందిగా కోరింది. సమంత పిలుపుకు చాలామంది సెలబ్రిటీలు స్పందించారు. సోషల్ మీడియా ద్వారా రకరకాలుగా స్పందించారు. దాంతో చేనేతకు విపరీతమైన పబ్లిసిటీ దక్కుతోంది. ఈ షోలో సమంత, నాగచైతన్య సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచారు. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏదో ఉన్నాలే అన్నట్లుగా కాకుండా, సమంత చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తోంది. అందుకే అంత తెలివిగా కేటీఆర్, సమంతని బ్రాండ్ అంబాసిడర్గా చేసి ఉంటారు. తనకిచ్చిన ఈ అపురూపమైన గౌరవాన్ని సమంత చాలా చక్కగా బాధ్యతగా వినియోగించుకుంటోంది. త్వరలో సమంత, నాగ చైతన్య పెళ్ళి పీటలెక్కనున్నారు. ఈ జంటని చూసి ఈ కార్యక్రమానికి హాజరైనవారంతా చాలా ముచ్చటపడ్డారు. మరో పక్క ఆన్ స్క్రీన్ కూడా వీరిద్దరూ కలిసి ఓ సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సమంత 'రంగస్థలమ్' లో నటిస్తోంది. చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సుకుమార్ డైరెక్షన్ చేస్తున్నారు. చైతూ హీరోగా తెరకెక్కుతోన్న 'యుద్ధం శరణం' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.