మాస్ డైరెక్టర్గా మంచి పేరుంది సంపత్ నందికి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో 'రచ్చ' సినిమా చేశాడు. సూపర్ సక్సెస్ కొట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో 'గబ్బర్సింగ్' చేయాల్సింది. కానీ తృటిలో ఆ అవకాశం మిస్సయ్యింది సంపత్ నందికి. మళ్లీ చాన్నాళ్ల తర్వాత మెగా కాంపౌండ్లో సంపత్ నంది మాట వినిపిస్తోంది. ప్రస్తుతం గోపీచంద్తో 'గౌతమ్ నందా' సినిమా చేస్తున్నాడు సంపత్ నంది. అయితే ఈ సినిమా తర్వాత మెగా హీరోతో సినిమా తెరకెక్కించాలని అనుకుంటున్నాడట. అయితే ప్రస్తుతం మెగా హీరోల్లో ఏ ఒక్కరూ ఖాళీగా లేదు. రామ్చరణ్ సుకుమార్తో చేయాల్సిన సినిమా త్వరలోనే సెట్స్ మీదికెళ్లనుంది. అల్లు అర్జున్ 'డీజె'తో బిజీగా ఉన్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతిలో 'ఫిదా', 'మిస్టర్' రెండు సినిమాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఇక మరో మెగా హీరో సాయి ధరమ్ 'విన్నర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి చెప్పనే అక్కర్లేదు. రెండు మూడేళ్ల దాకా పవన్ డేట్స్ ఖాళీగా లేవు. ఇక మిగిలిందల్లా మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ప్రస్తుతం చిరంజీవి రీ ఎంట్రీలో వస్తోన్న సినిమా 'ఖైదీ నెంబర్ 150' రిలీజ్ సొగసులద్దుకుంటోంది. ఇక చిరంజీవి 151వ సినిమా ఎవరితో అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ సంపత్నందికి ఏమైనా పిలుపు వచ్చిందో ఏమో. తాజాగా ఈ గాసిప్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. అదే గనుక జరిగితే అప్పుడు పవన్తో మిస్సయిన ఛాన్స్ ఇప్పుడు మెగాస్టార్తో దక్కినట్లే సంపత్ నందికి.