ఆసుపత్రిలో అర్జున్ రెడ్డి హీరోయిన్!

మరిన్ని వార్తలు

హీరోయిన్‌ షాలినీ పాండేని టీవీ ఛానెల్లో చూసి అంతా షాక్‌కి గురయ్యారు. ఎందుకంటే స్ట్రెచర్‌ మీద పడుకోబెట్టి ఆమెని ఆసుపత్రి లోపలికి తీసుకెళ్తున్న వీడియోలు చూసి అంతా షాక్‌ తిన్నారు. అదే స్ట్రెచర్‌ మీద పడుకోబెట్టి పూర్తిగా ఆమెని కవర్‌ చేసేసి ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లి, మళ్లీ అలాగే కవర్‌ చేసి బయటకి తీస్కొచ్చారు. నెల్లూరులో ఓ షోరూం ప్రారంభోత్సవానికి వెళ్లిన షాలినీ పాండేకి సడెన్‌గా జ్వరం రావడంతో దగ్గరల్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ తరలించడంలో ఆమెను స్ట్రెచర్‌ మీద పడుకోబెట్టి తెల్లని వస్త్రంతో కవర్‌ చేయడం పలు అనుమానాలకి తావిచ్చింది. అయితే ఎందుకిలా చేశారంటే, అభిమానులు గుర్తు పట్టి చుట్టుముడతారనే భయంతోనే అలా చేశారట. సాధారణ జ్వరమే కావడంతో ప్రాధమిక చికిత్స చేసి ఆమెని పంపించేశారు. ఆ తర్వాత తాను క్షేమంగానే ఉన్నాననీ, అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదనీ షాలిని తెలిపింది. 'అర్జున్‌రెడ్డి' సినిమాతో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. సడెన్‌గా ఈ విధంగా టీవీలో కనిపించేసరికి, ఆడియన్స్‌ షాక్‌ తినడం అనేది సహజమే. అయితే వెంటనే ఆమె స్పందించడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి షాలినీ భలే చేసిందిలే!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS