'బిగ్‌బాస్‌' కంటెస్టెంట్స్‌పై శ్రీరెడ్డి ఫైర్‌

మరిన్ని వార్తలు

కాస్టింగ్‌ కౌచ్‌ అంటూ రోడ్డుకెక్కి పలువురు సినీ ప్రముఖులపై అసభ్యకర ఆరోపణలు చేసిన శ్రీరెడ్డిని ఇప్పుడు ఏ మీడియా పట్టించుకోవడం లేదు. దాంతో సోషల్‌ మీడియా వేదికగా తన నోటికి నచ్చిన ప్రేలాపన పేలుతోంది. కానీ తన బాధ పాపం చాలా మందికి వినిపించడం లేదే.! ఏదో ఒక రకంగా పబ్లిసిటీ కావాలనే తపనలో భాగంగా ఇప్పుడు శ్రీరెడ్డి తన ఫైర్‌ని బుల్లితెరపై పాపులర్‌ అవుతున్న మెగా రియాల్టీ షో 'బిగ్‌బాస్‌'పై పడింది. 

నిన్న మొన్నటి దాకా బిగ్‌బాస్‌ హోస్ట్‌గా వ్యవహరించిన నానిపై విరుచుకుపడిన శ్రీరెడ్డి ఇప్పుడు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ అయిన తనీష్‌, కౌషల్‌ని టార్గెట్‌ చేసింది. తనీష్‌, కౌషల్‌ కామాంధులు అంటూ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు నిజమైనా కాకపోయినా, ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న ఈ ఇద్దరికీ పాపం శ్రీరెడ్డి ఆరోపణలు వినిపించవు కనిపించవు కదా. అలాంటప్పుడు వీరిపై ఆరోపణలు చేయడంలో శ్రీరెడ్డి ఉద్దేశ్యం ఏమనుకోవాలి.  

ఇటీవల కలకలం రేపుతున్న అమెరికా సెక్స్‌ రాకెట్‌కి సంబంధించి శ్రీరెడ్డి చేసిన హల్‌చల్‌ అంతా ఇంతా కాదు. ఆ సెక్స్‌ రాకెట్‌కి సంబంధించిన హీరోయిన్లు, యాంకర్ల లిస్టు తన వద్ద ఉందనీ త్వరలోనే బయటపెడతానంటూ కొంతమంది ఫోటోలు కూడా లీక్‌ చేసింది. ఎన్ని చేసినా శ్రీరెడ్డి ఆరోపణలు నిరాధారమైనవే అని ఎప్పటికప్పుడే తేలిపోతున్నా, ఆమె పబ్లిసిటీ స్టంట్‌ మాత్రం ఆపడం లేదు. 

చూడాలి ఇంకా ఇంకా శ్రీరెడ్డి ఎంత దూరం వెళుతుందో.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS