మిల్కీ బ్యూటీ ఎందుకీ మౌనం?

మరిన్ని వార్తలు

మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా 'జై లవకుశ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినా కానీ తమన్నా గురించిన టాక్‌ ఎక్కడా వినిపించలేదు. ఈ సినిమాలో తమన్నా స్వింగ్‌ జరా.. అంటూ ఐటెం సాంగ్‌లో నటించింది. ఎన్టీఆర్‌ - తమన్నా ఐటెం సాంగ్‌ అంటే ఎంత హైప్‌ క్రియేట్‌ కావాలి. కానీ అలా జరగలేదు. ఈ సినిమాకి సంబంధించి ఓన్లీ ఎన్టీఆర్‌ తప్ప ఇంకెవ్వరూ ఎలివేట్‌ కాలేదు. ఈ సినిమాలో హీరోయిన్స్‌తో కంపేర్‌ చేస్తే తమన్నాకి స్కోప్‌ ఎక్కువ. స్టార్‌ హీరోయిన్‌ ఆమె. అలాంటిది సినిమా రిలీజ్‌కి ముందు కానీ, రిలీజ్‌ తర్వాత కానీ తమన్నా పేరు ఎక్కడా వినిపించలేదు. సరికదా ఆమె కూడా ఎక్కడా కనిపించలేదు. 'జనతా గ్యారేజ్‌'లో కాజల్‌ అగర్వాల్‌ నర్తించిన 'నేను లోకల్‌.. ' సాంగ్‌కి ఏ స్థాయిలో హైప్‌ క్రియేట్‌ అయ్యిందో తెలిసిందే. అలాంటిది మిల్కీ బ్యూటీకింకెంతలా టాక్‌ రావాలి? గతంలోనూ తమన్నా ఐటెం సాంగ్స్‌లో నటించింది. కానీ స్టార్‌ హీరోల సినిమాలు కావవి. ఎందుకు తమన్నా కూడా ఈ విషయంలో మౌనంగా ఉండిపోయింది అని ఆమె అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 'బాహుబలి - 2' సినిమా టైంలోనూ తమన్నాకి ఇలాగే జరిగింది. అప్పటి సంగతి ఎలా ఉన్నా, లేటెస్టుగా ఆమె అభిమానులు మాత్రం చాలా నిరాశకు గురవుతున్నారు 'జై లవకుశ' విషయంలో. మిశ్రమ టాక్‌తో రన్‌ అవుతోంది 'జై లవకుశ' మూవీ. వసూళ్ల పరంగా ఓకే అనిపించినప్పటికీ టాక్‌ మాత్రం భిన్నంగానే వినిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS