పవన్‌ కళ్యాణ్‌ వస్తున్నాడా? లేదా?

మరిన్ని వార్తలు

చిరంజీవి హీరోగా రీ ఎంట్రీలో వస్తోన్న సినిమా 'ఖైదీ నెంబర్‌ 150'. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని గుంటూరులోని హాయ్‌లాండ్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడ కోసం అక్కడ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మొదట ఈ వేడుక 4వ తేదీన జరగనుంది. కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్‌పోన్‌ అయ్యింది. 7వ తేదీన జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం హాయ్‌లాండ్‌లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సమయం తక్కువగా ఉండడం వల్ల ఈ ఫంక్షన్‌కి హాజరయ్యే అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి అల్లు అరవింద్‌ హాయ్‌లాండ్‌ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ వేడుకకి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా హాజరయ్యే అవకాశాలున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ ఈ కార్యక్రమానికి చీఫ్‌ గెస్ట్‌గా రానున్నారంటూ వార్తలు వినవస్తున్నాయి. కానీ ఈ రోజు అల్లు అరవింద్‌ వద్ద ఈ విషయం ప్రస్తావించగా, ఆయన ఇండియాలో ఉంటే ఖచ్చితంగా ఈ ఫంక్షన్‌కి హాజరవుతారు. అని చెప్పారు. అలాగే చరణ్‌, తన బాబాయ్‌ని తానే స్వయంగా ఆహ్వానిస్తానని అంటున్నాడుగానీ, పవన్‌ వస్తారో, రారో తనకు ఇప్పటికైతే తెలియదని అన్నాడు. కానీ మెగా ఫ్యాన్స్‌ మాత్రం ఈ ఫంక్షన్‌ కోసం చాలా ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన హీరోలందరూ ఒకే వేదికపై కనిపించాలన్నదే వారి ఎదురుచూపులకు కారణం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS