చిరంజీవి హీరోగా రీ ఎంట్రీలో వస్తోన్న సినిమా 'ఖైదీ నెంబర్ 150'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ని గుంటూరులోని హాయ్లాండ్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడ కోసం అక్కడ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మొదట ఈ వేడుక 4వ తేదీన జరగనుంది. కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అయ్యింది. 7వ తేదీన జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం హాయ్లాండ్లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సమయం తక్కువగా ఉండడం వల్ల ఈ ఫంక్షన్కి హాజరయ్యే అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి అల్లు అరవింద్ హాయ్లాండ్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ వేడుకకి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా హాజరయ్యే అవకాశాలున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా రానున్నారంటూ వార్తలు వినవస్తున్నాయి. కానీ ఈ రోజు అల్లు అరవింద్ వద్ద ఈ విషయం ప్రస్తావించగా, ఆయన ఇండియాలో ఉంటే ఖచ్చితంగా ఈ ఫంక్షన్కి హాజరవుతారు. అని చెప్పారు. అలాగే చరణ్, తన బాబాయ్ని తానే స్వయంగా ఆహ్వానిస్తానని అంటున్నాడుగానీ, పవన్ వస్తారో, రారో తనకు ఇప్పటికైతే తెలియదని అన్నాడు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ ఫంక్షన్ కోసం చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన హీరోలందరూ ఒకే వేదికపై కనిపించాలన్నదే వారి ఎదురుచూపులకు కారణం.