శ్యాం కె నాయుడు విచారణ ముగిసింది

మరిన్ని వార్తలు

నిన్నటినుండి మొదలయిన SIT విచారణకి ఈరోజు హాజరయిన కెమెరామెన్ శ్యాం కె నాయుడు విచారణ ముగిసింది.

ఇక ఈ విచారణలో శ్యాం పూర్తిగా సహకరించిన్నట్టు అలాగే SIT అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడని SIT వర్గాలు దృవీకరించాయి. విచారణ మొత్తం సంతృప్తికరంగా సాగినట్టు తెలిసింది.

అయితే హైదరాబాద్ దాటి ఎటైనా వెళ్ళాల్సిన పరిస్థితిల్లో SIT అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని సూచించిన్నట్టు తెలిసింది. నిన్న పూరి జగన్నాధ్ విచారణ దాదాపుగా 11గంటలు సాగగా ఈరోజు మాత్రం సుమారు 5గంటల పాటు జరిగింది.

ఇక రేపు ఎవరు SIT విచారణకి హాజరయ్యేది నటుడు సుబ్బరాజు అని తెలుస్తుంది. Excise Commissioner చంద్రవదన్ మాట్లాడుతూ- రేపు ఎవరు విచారణకి హాజారు అవుతారు అనే దాని పై ఈ సాయంత్రం ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తామని తెలిపారు.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS