జోరు పెంచిన శర్వా

మరిన్ని వార్తలు

చార్మింగ్ స్టార్ శర్వానంద్ ఫుల్ స్పీడ్ మీదున్నాడు. శర్వా కెరియర్ మొదటినుంచి ప్రయోగాలు చేస్తూ, తన హార్డ్ వర్క్ తో పైకి ఎదిగాడు. ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఆ బేసిస్ లోనే శర్వా సినిమాలు ఉంటాయి. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మనమే' సినిమాతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించాడు. మనమే సినిమాతో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. మనమే ముందు చేసిన సినిమాలు ఏవి ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. దీనితో శర్వా పని అయిపోయింది అనుకున్న వాళ్లకి 'మనమే' తో సమాధానం చెప్పాడు. ఈ మూవీ హిట్ ఇచ్చిన కిక్కు తో మరో రెండు సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. 


మనమే సినిమా రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ టైం లో శర్వానంద్  రెండు సినిమాలకి ఒకేసారి వర్క్ చేస్తున్నారు. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ రేసింగ్ ఆధారంగా రూపొందుతున్నట్లు, శర్వా బైక్ రైడర్ గా కనిపించనున్నట్లు మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ల ద్వారా అర్థమవుతోంది. శర్వా నటించిన 'రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు లాంటి హిట్లు ఇచ్చిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీని తెరకెక్కిస్తోంది. 


రెండో సినిమా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతుంది. శర్వానంద్ 37 అనే వర్కింగ్ టైటిల్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో శర్వానంద్, సంయుక్త మీనన్ పై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. శర్వా ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి, మరి కొన్ని ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టె పనిలో ఉన్నారని సమాచారం. 2022 లో ఒకే ఒక జీవితం మూవీ వచ్చింది. తరువాత రెండేళ్ళకి మనమే సినిమాతో వచ్చారు. అంటే రెండేళ్ల లాంగ్ గ్యాప్ తీసుకోవటం వలన, ఆ గ్యాప్ కవర్ చేసే విధంగా శర్వా ప్లాన్ చేస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS