'ఆనందోబ్రహ్మ' పాట అదిరిందమ్మా

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ తాప్సీ బాలీవుడ్‌కి వెళ్లాక టాలీవుడ్‌ సినిమాలంటే అంతగా ఇంట్రెస్ట్‌ చూపించట్లేదన్న సంగతి తెలిసిందే. అయితే 'ఘాజీ' సినిమాతో అలా టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే మరో తెలుగు సినిమా 'ఆనందోబ్రహ్మ'తో రానుంది. ఇదో థ్రిల్లర్‌ మూవీ. బాలీవుడ్‌లో అమ్మడు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌తో బిజీగా గడుపుతోంది. అలాగే 'ఆనందోబ్రహ్మ' సినిమాలో కూడా తాప్సీ కీ రోల్‌ పోషిస్తోంది. వెన్నెల కిషోర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, షకలక శంకర్‌ తదితరులు ఇతర ముఖ్య తారాగణంగా నటిస్తున్నారు. లేటెస్టుగావీ సినిమా నుండి ఓ పాట విడుదలయ్యింది. 'నా మది నిన్ను పిలిచింది గానమై..' అంటూ సాగే ఈ సాంగ్‌ ప్రోమో అట్రాక్ట్‌ చేస్తోంది. అందమైన కొండపల్లి బొమ్మలా తాప్సీ నాట్యం చేస్తుంటే, విజువల్‌గా చాలా అందంగా కనిపిస్తోంది. అక్కడక్కడా వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌, శ్రీనివాస్‌ రెడ్డి డైలాగులతో ఈ ప్రోమో ఆశక్తికరంగా ఉంది. మాల్గుడి సుభ వాయిస్‌తో పాట చాలా వినసొంపుగా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో కొత్తదనంతో కూడిన హారర్‌ టచ్‌ ఇవ్వనున్నారట ఈ సినిమాలో. మహి బి రాఘవ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 'ఘాజీ' సినిమా తర్వాత తాప్సీ తెలుగులో చేస్తున్న సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS