నందమూరి ఫాన్స్ కి ప్రశాంత్ డబుల్ ట్రీట్

మరిన్ని వార్తలు

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎపుడు ఎంట్రీ ఇస్తాడో అని ఫాన్స్ ఇంతవరకు ఆసక్తిగా ఎదురుచూసారు. ఆ ఘడియ వచ్చేసిందని అనౌన్స్ చేశారు బాలయ్య. పుత్ర రత్నం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఖాయమని, హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో లాంచ్ అవనున్నాడని అఫీషియల్ గా ప్రకటించేశారు. సినిమాల్లోకి రాకముందే తన కొడుక్కి పాపులారిటీ వచ్చేసిందని, తనకిక ఎలాంటి భయం లేదని పుత్రోత్సాహాంతో చెప్పారు బాలయ్య. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా ఒక అద్భుతమైన ట్వీట్ చేశారు.       


సింహం తన కొడుకు సింబని పరిచయం చేస్తున్న యానిమేటెడ్ సినిమా ఫోటో షేర్ చేసి, సింబ వస్తున్నాడు అని, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి సింబా ఎంట్రీ అని పోస్ట్ చేసాడు ప్రశాంత్. ఈ సింబాలిక్ కంపేరిజానికి నందమూరి ఫాన్స్ ఉప్పొంగిపోయారు. బాలయ్యని సింహంతో పోల్చినప్పుడు, సింహం తనయుడు సింబానే కదా అని మోక్షజ్ఞ కి కొత్త బిరుదు ఇచ్చేస్తున్నారు. ప్రశాంత్ చేసిన పోస్ట్ ని నందమూరి ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ‘హ‌నుమాన్‌’ మూవీలో నార్మల్ కథకి చివర్లో మైథ‌లాజిక‌ల్ ట‌చ్ ఇచ్చి అలరించిన ప్రశాంత్, మోక్షజ్ఞ కథలో  కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడట. 


ఈ క‌థ‌లో మోక్షజ్ఞ సూప‌ర్ హీరోగా కనిపిస్తాడని సమాచారం. మోక్షజ్ఞ ఫిజిక్, హైట్ కరెక్ట్ గా సూపర్ హీరో పాత్రకి సరిపోతాయని, ప్రశాంత్ ఇలాంటి కథని సెలక్ట్ చేసాడట. ఇందులో సూపర్ హీరో కథతో పాటు మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్  కూడా ఉంటాయని సమాచారం. అంతే కాదు నందమూరి ఫాన్స్ కి ఒక సర్ప్రయిజ్ కూడా ప్లాన్ చేసాడట ప్రశాంత్. మూవీ లాస్ట్ లో బాల‌య్య శ్రీ‌ కృష్ణుడిగా ఎంట్రీ ఇచ్చేలా కథ రాసుకున్నాడని, దాదాపుగా స్క్రిప్టు పూర్తి అయిపోయిందని   బాల‌య్య‌కు ఈ పాత్ర గూర్చి  వివరించి ఓకే చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ఇలా ఒకే  సినిమాతో నందమూరి ఫాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడు ప్రశాంత్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS