సెంటిమెంట్‌ గురూ: వదల బొమ్మాళీ అంటోన్న డైరెక్టర్‌!

By Inkmantra - December 17, 2019 - 08:00 AM IST

మరిన్ని వార్తలు

దర్శకుడు బోయపాటి శీను తాజాగా బాలయ్యతో హ్యాట్రిక్‌ మూవీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌ ఇంకా ఫిక్స్‌ కాలేదు. కానీ, ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం కేథరీన్‌ ట్రెసా పేరు తెర పైకి వచ్చింది. గతంలో బోయపాటి తెరకెక్కించిన 'సరైనోడు', 'జయ జానకి నాయకా' చిత్రాల్లో వరుసగా కేథరీన్‌కి అవకాశమిచ్చాడు. 'సరైనోడు' చిత్రంలో గ్లామరస్‌ ఎమ్మెల్యేగా ఇంపార్టెంట్‌ రోల్‌ ఇవ్వగా, 'జయ జానకి..'లో ఐటెం సాంగ్‌ ద్వారా మళ్లీ రిపీట్‌ చేశాడు.

 

ఈ రెండు సినిమాలూ బోయపాటికి బంపర్‌ హిట్స్‌ అయ్యాయి. ఆ తర్వాత బోయపాటి 'వినయ విధేయ రామ'లో బాలీవుడ్‌ బ్యూటీ ఈషా గుప్తాని తీసుకొచ్చాడు స్పెషల్‌ రోల్‌ కోసం. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. దాంతో ఈ సారి మాత్రం సెంటిమెంట్‌ ఫాలో చేయాలనుకుంటున్నాడట. అందులో భాగంగానే కేథరీన్‌ని తాజా చిత్రానికి సెలెక్ట్‌ చేసుకోనున్నాడనీ ఫిలిం వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. అయితే, కేథరీన్‌ పాత్ర 'సరైనోడు' మాదిరి కీలకంగా డిజైన్‌ చేస్తాడా.? లేక 'జయ జానకి..'లా స్పెషల్‌ సాంగ్‌కి మాత్రమే పరిమితం చేస్తాడా.? అనేది తెలియాల్సి ఉంది.

ALSO SEE : Catherine Tresa

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS