ఫ్యామిలీ నుండి థ్రిల్లర్ కి వచ్చిన మోహనకృష్ణ

మరిన్ని వార్తలు

తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు క‌నుమ‌రుగైన సంద‌ర్భంలో `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు` వంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను వెంకటేశ్‌, మ‌హేశ్ వంటి స్టార్ హీరోల‌తో తెర‌కెక్కించిన మల్టీస్టార‌ర్ చిత్రాల‌కు నాంది ప‌లికిన నిర్మాత దిల్‌రాజు... నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌.

 

అక్క‌డి నుండి మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల సంఖ్య పెరుగుతూ వ‌స్తున్నాయి. ఈ ఏడాది దిల్‌రాజు ఇప్ప‌టికే వెంక‌టేశ్‌, వ‌రుణ్‌ తేజ్‌ల‌తో `ఎఫ్ 2`(ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‌) అనే మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది కాకుండా మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీకారం చుడుతున్నారు స్టార్ నిర్మాత దిల్‌రాజు. 

`అష్టాచ‌మ్మా, గోల్కొండ హైస్కూల్‌, అమీ తుమీ, జెంటిల్‌మన్‌, స‌మ్మోహ‌నం` వంటి డిఫ‌రెంట్‌,  సెన్సిబుల్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌నుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది ఈ చిత్రం.  త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివ‌రాల‌ను  చిత్ర‌యూనిట్ తెలియ‌జేస్తుంది.  

దిల్ రాజు-మోహనకృష్ణ ఇంద్రగంటి ల కలయిక ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS