వెంకీతో క్రిష్‌, ఈసారేంచేస్తాడో?

మరిన్ని వార్తలు

ప్రస్తుతం బాలయ్య వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాడు క్రిష్‌. విక్టరీ వెంకటేష్‌తో తన తదుపరి సినిమా ఉంటుందని అనౌన్స్‌ చేశాడు దర్శకుడు క్రిష్‌. అది వెంకటేష్‌ కెరీర్‌లో 75వ చిత్రం. బాలకృష్ణ హీరోగా నటించిన 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి'కి క్రిష్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అదే సెంటిమెంట్‌ ఇప్పుడు తన 75వ చిత్రానికి కూడా వర్తిస్తుందనుకుంటున్నాడేమో వెంకీ. అందుకే క్రిష్‌ చెప్పగానే వెంటనే ఓకే అన్నాడు. ఇంకో వైపున క్రిష్‌ సినిమాలో ఆల్రెడీ వెంకటేష్‌ నటించాడు. అయితే ఓ పాటలో మాత్రమే. అదే రానా, నయనతార జంటగా వచ్చిన 'కృష్ణం వందే జగద్గురుం'. ఆ సినిమా చేస్తున్నప్పుడే అనుకున్నారట వెంకటేష్‌తో సినిమా చేయాలని క్రిష్‌. ఆ కాంబినేషన్‌ ఇప్పటికి సెట్టయ్యింది. 'శాతకర్ణి'గా బాలయ్యను చూపించిన క్రిష్‌, వెంకీని ఎలా చూపించబోతున్నారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఓ పొలిటికల్‌ డ్రామా తరహాలో క్రిష్‌ - వెంకీ కాంబో ఉండబోతోందని సమాచారమ్‌. అలాగే ఓ మంచి మెసేజ్‌ని కూడా సొసైటీకి ఇవ్వబోతున్నారట ఈ సినిమాతో క్రిష్‌. ప్రస్తుతం 'గురు' సినిమాతో బిజీగా ఉన్నాడు వెంకీ. ఆ సినిమా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుందట. క్రిష్‌ కథతో రెడీగా ఉన్నాడు. ఇక వెంకీదే లేటు. 'గురు' సినిమాకి గుమ్మడికాయ కొట్టగానే ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టేయనున్నారు క్రిష్‌ టీమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS