టాలీవుడ్ లో హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకొన్న ఓ హీరో, దర్శకుడూ ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు. వాళ్ల కాంబోలో ఇది హ్యాట్రిక్ సినిమా. అయితే.. సెట్లో ఇప్పుడు ఈ హీరోకీ, దర్శకుడికీ పడడం లేదని, ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చిందన్న ఓ రూమర్ బలంగా వినిపిస్తోంది. ఆ హీరో, దర్శకుడు మరెవరో కాదట. గోపీచంద్ - శ్రీవాస్ అని టాక్.
వీరిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం అనే రెండు సినిమాలొచ్చాయి. రెండూ హిట్లే. ఇప్పుడు రామ బాణం అనే సినిమా రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమాపైనా మంచి అంచనాలే ఏర్పడ్డాయి.అయితే.. ఈమధ్య దర్శకుడికీ, హీరోకి అస్సలు పడడం లేదని, ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. సినిమా బడ్జెట్ దాటేయడం, సీన్ విషయలో క్లారిటీ లేకపోవడం, ఫుటేజ్ పెరిగిపోవడం తదితర కారణాల వల్ల... గోపీచంద్ కీ, దర్శకుడికీ మధ్య క్లాష్ వచ్చిందని చెప్పుకొంటున్నారు. అయితే ఇది నిజమా? కాదా? అనేది తేలాల్సివుంది. ఓ సినిమా సెట్ పై ఉన్నప్పుడు ఇలాంటి క్రియేటీవ్ డిఫరెన్సెస్ రావడం సహజమే. సినిమా హిట్టయితే..ఈ మైనస్సులే ప్లసులు అయిపోతాయి. మరి రామబాణం విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.