మెగా హీరోలతో హరీష్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్

మరిన్ని వార్తలు

షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు హరీష్ శంకర్. మొదట మిస్టర్ బచ్చన్ మూవీని ఆగస్టు 15 న రిలీజ్ చేస్తూ సర్ప్రయిజ్ ఇవ్వగా నిన్న రామ్ తో సినిమా అనౌన్స్ చేసి ఆహా అనిపించాడు. మళ్ళీ వెంటనే అదిరిపోయే ఇంకో న్యూస్ చెప్పాడు. అదేంటి అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమా అని ఊరిస్తున్నాడు. ప్లాన్ చేసుకుంటే  పాన్ ఇండియా రాదనీ, మూవీ కున్న క్రేజ్ బట్టీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందుతుందని హరీష్ పేర్కొన్నాడు. ఇండియా - పాకిస్తాన్ బార్డర్ బ్యాక్ డ్రాప్ లో గతంలో ఓ లవ్ స్టోరీ రాసుకున్నానని, ఫుల్ ప్లెడ్జ్ గా దాన్ని డవలప్ చేసి తీస్తే అది కచ్చితంగా బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందని హరీష్ తెలిపాడు. 


చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఈ మూగురితో సినిమా తీసేలా ఓ లైన్ ఉందని, అది ఇప్పటిది కాదు ఎప్పటినుంచో అనుకుంటున్నా అని, నిజంగా ఇది వర్క్ అవుట్ అయితే, ఆ కథ మీద వర్క్ చేస్తే అంచనాలు పీక్స్ లో ఉంటాయని మెగా ఫాన్స్ ని ఆశ పెట్టాడు. హరీష్ చెప్పిన ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ పై అప్పుడే ఫాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ముగ్గురు మెగా హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపించటం, అదీ పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ అంటే పూనకాలు లోడింగ్. 


పైగా ఇది గాసిప్ కాదు. స్వయంగా దర్శకుడు చెప్పిన మాట కావటంతో దీనిపై ఎలాంటి సందేహాలు లేవు. ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు రామ్ చరణ్. ఏపీ లో విజయం సాధించటం, మోదీ లాంటి నేతతో ప్రశంసలు అందుకోవటంతో నార్త్ లో కూడా పవన్ కళ్యాణ్ ఫేమస్ అయ్యారు. చిరుకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అలాంటి వీరి ముగ్గురు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS