సంక్రాతి నుంచి ఎగిరిపోయిన ఈగల్

మరిన్ని వార్తలు

2024 సంక్రాంతికి 5 తెలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయని సినీ ప్రియులు ఆనందంగా ఉన్నారు. అందరూ సీనియర్ హీరోల సినిమాలే. మహేష్ , వెంకటేష్, నాగార్జున, రవి తేజ, తేజా సజ్జా హనుమాన్. కానీ మహేష్ గుంటూరు కారం మూవీ ఎక్కువ థియేటర్స్ ఆక్యుపే చేయటంతో మిగతా వాటికి థియేటర్స్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వెంకీ, నాగ్ , తేజా మూవీస్ పోస్ట్ ఫోన్ చేసుకుంటే బాగున్ను అనే టాక్ వినిపిస్తోంది. కానీ అనూహ్యంగా మాస్ మహారాజ్ రవితేజ  యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఈగల్' సంక్రాతి బరి నుంచి తప్పుకుందని టాక్ వినిపిస్తోంది. 


సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని తెర కెక్కించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతికి ఈగల్ తో ఒక డిఫరెంట్ మాస్ యాక్షన్ సబ్జెక్ట్ తో వస్తున్నామని మేకర్స్ చెప్పారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా చేసి ఆడియన్స్ లో ఆసక్తి పెంచారు.  రీసెంట్ గా సెన్సార్ కి  వెళ్లిన ఈ మూవీకి కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ న్యూస్ విన్న ఫాన్స్ సంతోషంలో ఉండగానే  ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతికి రావటం లేదన్న వార్త షాక్ ఇచ్చింది. 


ఇన్ని సినిమాల మధ్య థియేటర్స్ దొరకడం లేదని, ఇలా తక్కువ థియేటర్స్ తో రావడం కంటే కొంచెం ఆగి రావడం బెటర్ అని ఈగల్ టీం ఈ నిర్ణయం తీకునట్లు తెలుస్తోంది. అందుకనే ఈ చిత్రాన్ని జనవరి 26కి పోస్టుపోన్ చేసినట్లు సమాచారం. అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. ఒకటి రెండు రోజుల తరవాత ఏ విషయం తెలియనుంది. ఈగల్ సంక్రాతికి రావటం ఇప్పటికైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అని ఫిల్మ్ వర్గాల టాక్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS