ప్రభాస్ ఈ ఏడాదిలోనే ‘ఆదిపురుష్’ 'సలార్' రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆది పురుష్ విమర్శల పాలయ్యింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడని ఆడియన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రంలోని VFX, పాత్రల చిత్రీకరణ తీవ్ర నిరాశపరిచాయి. ఆ డిజాస్టర్ టాక్ ని సలార్ భర్తీ చేసి ఇయర్ ఎండింగ్ ప్రభాస్ కి బిగ్గెస్ట్ హిట్ వచ్చింది. ఈ మూవీ 800 కోట్లకు పైగా వసూల్ చేసింది. నెక్స్ట్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 AD‘ అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ.
రీసెంట్ గా 'కల్కి 2898 AD ' చిత్ర ఎడిటర్ విశాల్ కుమార్ ఆదిపురుష్ మూవీ గూర్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్కిలో VFX వర్క్స్ గురించి ఇన్ స్టాలో తన ఫాలోవర్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు విశాల్. “గత VFX సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో VFX పనితీరు ఎలా ఉంది? ఎమైనా మెరుగుదల కనిపిస్తుందా? అని ఓ ఫాలోవర్ అడిగిన ప్రశ్నకి బదులిస్తూ ‘ఆదిపురుష్’ VFXపై విమర్శలు చేశారు.
"గత 10 సంవత్సరాలుగా VFX మీద రీసెర్చ్ చేస్తున్నాం. ‘అవతార్’, ‘అవెంజర్స్’ లాంటి సినిమాల VFXను కూడా పరిశీలించాం. దీని ఫలితాన్ని ‘కల్కి’లో చూస్తాం. ఇది మీ ‘ఆదిపురుష్’ కాదు" అని కామెంట్ చేశారు. ఒక సినిమాను, ఇంకో సినిమాతో కంపేర్ చేస్తూ కామెంట్స్ చేయటం. ఆ రెండు ప్రభాస్ సినిమాలు కావటంతో ఈ వ్యాఖ్యలు ప్రజంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.