ఎన్టీఆర్‌ని బాగా వాడేస్తున్నారు

మరిన్ని వార్తలు

నందమూరి కళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'జై లవకుశ'. టైటిల్‌తోనే ఈ సినిమా అంచనాల్ని పెంచేసింది చిత్ర యూనిట్‌. ఇక టైటిల్‌ లోగోలో కూడా ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ కొత్తగా క్రియేటివిటీని ఉపయోగించకుండా, తాత గారు ప్రధాన పాత్రలో వచ్చిన 'లవకుశ' సినిమా లోగోని వాడుతుండడం విశేషం. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఈ లోగోలతో ఆ అంచనాలు మరింత పెరుగుతుండగా, ఇక ఈ సినిమా టీజర్‌ రానుంది. టీజర్‌లో ఇంకెంత హడావిడి చేస్తారో అంటూ ఫ్యాన్స్‌ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్‌ అంచనాలు ఏ మాత్రం మించకుండానే టీజర్‌ని ప్రిపేర్‌ చేస్తోందట చిత్ర యూనిట్‌. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. లవకుశల్లానే ఈ ఇద్దరు అన్నదమ్ములు సినిమాని విజయం పథంలో నిలిపేందుకు తగిన మార్కెటింగ్‌ ప్లానింగ్స్‌ని ఫాలో చేస్తున్నారు. అందులోదే ఈ లోగో సెంటిమెంట్‌. స్వర్గీయ నందమూరి తారక రామారావు కెరీర్‌లో ఓ ఆణిముత్యం 'లవకుశ'. ఈ సినిమా లోగోతోనే ప్రస్తుతం 'జై లవకుశ' సినిమాకి పబ్లిసిటీ షురూ చేశారు. మరో మూడు రోజుల్లో ఈ సినిమా టీజర్‌ రానుంది. సినిమాలో ఎన్టీఆర్‌ మూడు గెటప్స్‌లో నటిస్తుండడం విశేషం కాగా, అందులో ఒకటి నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర కావడం మరో విశేషం. రాశీఖన్నా, ,నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS