కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు.. తెలుగులో సెటిల్ అయిపోతాడా?

మరిన్ని వార్తలు

క‌న్న‌డ చిత్రం `కేజీఎఫ్‌`తో ఆక‌ట్టుకున్నాడు ప్ర‌శాంత్ నీల్. ఆ సినిమా దేశ వ్యాప్తంగా విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించింది. తెలుగులోనూ భారీ వ‌సూళ్లు ద‌క్కాయి. దాంతో.. ప్ర‌శాంత్ నీల్‌కి తెలుగు నుంచి మంచి ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌, మ‌హేష్ లాంటి స్టార్లు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

 

ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ కాంబో సెట్ అయిపోయిన‌ట్టు వార్త‌లొచ్చాయి. జూమ్ లోనే ఎన్టీఆర్‌కి ప్ర‌శాంత్ క‌థ చెప్పేశాడ‌ని, అది విని ఎన్టీఆర్ బాగా ఇంప్రెస్ అయ్యాడ‌ని టాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈలోగా ప్ర‌భాస్ - ప్ర‌శాంత్ నీల్ కాంబో సెట్ట‌యిన‌ట్టు కూడా వార్త‌లు మొద‌ల‌య్యాయి. క‌న్న‌డ మీడియా మొత్తం ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్ కాంబో లో ఓ సినిమా వ‌స్తోంద‌ని వార్త‌లు రాస్తోంది. ప్ర‌భాస్ తో ప్ర‌శాంత్ నీల్ ఓ సినిమా చేయ‌డం దాదాపు ఖాయ‌మే. కానీ అదెప్పుడ‌న్న‌ది తెలీదు. మ‌హేష్ కూడా ప్ర‌శాంత్ తో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ సినిమాని మైత్రీ మూవీస్ నిర్మించ‌నుంది. కేజీఎఫ్ 2 త‌ర‌వాత ఎన్టీఆర్ సినిమానే ప‌ట్టాలెక్కే ఛాన్సుంది. ఆ త‌ర‌వాత ప్ర‌భాస్, మ‌హేష్‌లు లైన్ లోకి వ‌స్తారు. ఎలా చూసినా.. ఈ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు టాలీవుడ్ లో స్థిర‌ప‌డిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS