సలార్ లో కియారా హీరోయిన్ కాదా?

మరిన్ని వార్తలు

ప్రభాస్ నటించిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ సాధించిన సంగతి తెలిసిందే. సుమారు వెయ్యికోట్ల కలక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా మొదలయినట్టు దర్శకుడు ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. సలార్ లో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. సెకండ్ పార్ట్ లో శృతితో పాటు ఇంకొక హీరోయిన్ కి చోటు ఉందని, అందుకనే ఆ పాత్రకి కియారా అద్వానీని తీసుకున్నట్టు వార్తలు వినిపించాయి. దీనితో కియారా నక్క తోక తొక్కిందని , వరస పానిండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తూ వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంటోంది అనుకున్నారు అంతా. కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం, సలార్ 2 లో కియారా సెకండ్ హీరోయిన్ అన్న మాట వాస్తవం కాదని తెలుస్తోంది. 
       

ఒక వైపు గేమ్ చేంజెర్ లో గ్లోబల్ స్టార్  రామ్ చరణ్ తో నటిస్తూ, ఇంకో వైపు పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ తో కూడా నటిస్తోంది అన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో  కియారా సలార్ 2  లో హీరోయిన్ కాదని, ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆమెని సంప్రదించినట్టు టాక్. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా సత్తా చాటుతూ , మంచి గుర్తింపు పొందుతున్నాయి. వీటిలో నటించి వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న వారు ఉన్నారు. పుష్ప లో ఊ అంటావా ... మావా ఊ ఊ అంటావా మావా సాంగ్ ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ పాటతో సామ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.   


అందుకే స్టార్ హీరోయిన్స్ కూడా ప్రత్యేక గీతాల్లో నర్తించటానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. వీటి కోసం భారీగా రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారు. ఊర్వశీ రౌతేలా ఇలాగే స్పెషల్ సాంగ్స్ చేసి టాలీవుడ్ లో మంచి  గుర్తింపు తెచ్చుకుంది. ఒక్కో పాటకి కోటి రూపాయలు తీసుకుంటుంది. పుష్ప 2 లో జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్ లో చిందేయనుంది. కాజల్, తమన్నా, సమంత, పూజా లాంటి స్టార్ హీరోయిన్స్  ఐటమ్ సాంగ్స్ కూడా చేశారు. వీరి తర్వాత జాన్వీ, కియారా, శ్రీలీల కూడా  ఐటమ్ గాళ్స్ గా మారనున్నారన్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS