దసరాకి మహేష్‌ 'స్పైడర్‌'

మరిన్ని వార్తలు

మహేష్‌ ఈ దసరాకి అభిమానులకు బంపర్‌ గిఫ్ట్‌ ఇవ్వనున్నాడు. దసరాకి తన కొత్త సినిమా 'స్పైడర్‌'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో ఉన్నాడు. సెప్టెంబర్‌ 27న 'స్పైడర్‌' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయం మహేష్‌ తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ నెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ విడుదల కానుంది. మురుగదాస్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది ఈ సినిమా. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో తమిళ కాస్టింగ్‌ ఎక్కువగానే ఉంది. తమిళ యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో భరత్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. భరత్‌ తెలుగులోనూ పలు చిత్రాలతో తన నటనతో ఆకట్టుకున్నాడు. తమిళ డైరెక్టర్‌ కమ్‌ హీరో ఎస్‌జె.సూర్య మహేష్‌కి విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదో బైలింగ్వల్‌ మూవీ. తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి విడుదలవుతోంది. మహేష్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా పైనే సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఆశలన్నీ. ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ పాత్రలో చాలా పవర్‌ ఫుల్‌ రోల్‌ పోషిస్తున్నాడు మహేష్‌ ఈ సినిమాలో. మరో పక్క కొరటాల శివతో 'భరత్‌ అను నేను' సినిమా కూడా సెట్స్‌ మీదికెక్కింది. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS