'మనసుకు నచ్చింది' ఇంకా నచ్చేస్తోంది

మరిన్ని వార్తలు

మహేష్‌బాబు సోదరి మంజుల దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మనసుకు నచ్చింది'. ఫస్ట్‌లుక్‌తోనే మంచి రెస్పాన్స్‌ అందుకుంది. తాజాగా టీజర్‌ విడుదలైంది. కూల్‌ అండ్‌ రొమాంటిక్‌ యాంగిల్‌లో ఈ టీజర్‌ని కట్‌ చేశారు. 

ఆహ్లాదమైన వాతావరణం, అందులో చక్కటి ప్రేమ జంట. జాలు వారుతున్న జలపాతాలు, పచ్చని చెట్లూ, అందమైన సీతాకోక చిలుక.. వాటి మధ్యలో అంతకన్నా అందమైన హీరోయిన్‌.. స్వీట్‌గా చెబుతున్న డైలాగ్‌. నది మధ్యలో ప్రపంచమంత ప్రేముంటుందిరా.. అంటూ చెబుతున్న డైలాగ్‌ మనుసుకు నచ్చింది.

సందీప్‌ కిషన్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌, సందీప్‌ కిషన్‌కి జోడీగా నటిస్తోంది. ఈ ఇద్దరి మధ్యా లవ్‌స్టోరీనే 'మనసుకు నచ్చింది' సినిమా. ఇంతవరకూ మనసుకు నచ్చే లవ్‌ స్టోరీలు చాలానే వచ్చాయి. అయితే ఈ లవ్‌ స్టోరీ చాలా ఆహ్లాదంగా ఉండబోతోందని మంజుల చెప్పింది. ఫస్ట్‌లుక్‌, టీజర్స్‌తో మెల్ల మెల్లగా ఆ విషయం ప్రూవ్‌ చేసుకుంటోంది మంజుల. ఇంతవరకూ నటిగా, నిర్మాతగా తన సత్తా చాటిన మంజుల ఈ సినిమాతో మెగాఫోన్‌ పట్టింది.

ఎంతో ఆలోచించి, ఎంతగానో శ్రమించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నానని ఓ వీడియో ద్వారా మంజుల ఇదివరకే చెప్పింది. అంతేకాదు ఈ సినిమాలో మంజుల కూతురు జాహ్నవి తెరంగేట్రం చేస్తోంది. అయితే హీరోయిన్‌గా కాదట. ఓ కీలక పాత్రలో జాహ్నవి నటిస్తోంది. మొత్తానికి మంజుల దర్శకత్వంలో వస్తోన్న తొలి సినిమా ఓ తీపి జ్ఞాపకంలా గుర్తుండిపోవాలని భావిస్తోందట. అందుకే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కిస్తున్నానంటోంది మంజుల. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమా అందరి మనసుల్ని దోచుకునేలా ఉండబోతోందని చిత్ర యూనిట్‌ నమ్మకం వ్యక్తం చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS