మంచు విష్ణు మళ్లీ గొంతెత్తాడు. ట్రోలర్స్, మీమర్స్ మీద విరుచుకుపడ్డాడు. అంతే కాదు... వీటి వెనుక ఓ హీరో ఉన్నాడని, త్వరలోనే తన బండారం బయటపెడతాడనని, తనపై కేసు వేస్తానని హెచ్చరించాడు విష్ణు. తను నటించిన జిన్నావిడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మీమర్స్, ట్రోలర్స్ తో ఓ ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ట్రోలర్స్కి హెచ్చరికలు జారీ చేశాడు
''నా సినిమా నచ్చకపోతే తిట్టండి. ట్రోల్ చేయండి, నేను స్పోర్టీవ్ గా తీసుకొంటా. కానీ నా కుటుంబం జోలికి మాత్రం రావొద్దు.. మీక్కూడా కుటుంబాలు ఉన్నాయని గుర్తుంచుకోండి'' అని సున్నితంగా వార్నింగ్ ఇచ్చాడు. ఓ హీరో జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఓ సాఫ్ట్ వేర్ ఆఫీసు తెరచి, 21మంది ఉద్యోగుల్ని నియమించుకొని, తనని, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ట్రోలింగ్ చేయిస్తున్నాడని, పూర్తి ఆధారాలతో త్వరలోనే ఆ హీరోపై కేసు వేస్తానంటున్నాడు విష్ణు. ఆ హీరో పేరు మాత్రం బయటకు చెప్పలేదు. విష్ణు నటించిన `జిన్నా` అక్టోబరు 5న విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా అక్టోబరు 21కి వెళ్లిపోయింది.