గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మెగాస్టార్

మరిన్ని వార్తలు

గణతంత్ర దినోత్సవ వేడుకులు ఈ రోజు దేశమంతటా పండగల జరుపుకుంటున్నారు. నేడు 72 వ గణతంత్ర దినోత్సవం. ఈ వేడుకలు అన్ని రంగాల్లో.. రాజకీయ నాయకుల నుండి సామాన్య ప్రజలంతా జరుపుకునే పండగ. రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ జరుపుకునే ఈ వేడుకలు ఎప్పటి లాగే ఈ రోజు చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నాగబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు పాల్గొన్నారు.

 

ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు టీం తో పాటు మెగా ఫాన్స్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెగా అభిమానులు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించి రక్తదానం చేసిన అభిమానులను చిరంజీవి, రామ్ చరణ్ లు పరామర్శించారు. మెగా అభిమానుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
chiranjeevi


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS