సిరివెన్నెల మ‌ర‌ణంతో... వాయిదాల ప‌ర్వం

మరిన్ని వార్తలు

టాలీవుడ్ ని పెను విషాదం కుదిపేస్తోంది. గీత ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి మ‌ర‌ణంతో... చిత్ర‌సీమ శోక స‌ముద్రంలో మునిగిపోయింది. ఆయ‌న జ్ఞాప‌కాల‌తో త‌ల్ల‌డిల్లుతోంది. ఈ నేప‌థ్యంలో... టాలీవుడ్ లో కొన్ని నిర్మాణ సంస్థ‌లు కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఈ రోజు... `భీమ్లా నాయ‌క్‌`లోని అడ‌వి త‌ల్లి అనే పాట విడుద‌ల కావాల్సివుంది. దాన్ని చిత్ర‌బృందం వాయిదా వేసింది. అలానే.. ఈనెల 3న `ఆర్‌.ఆర్‌.ఆర్‌` ట్రైల‌ర్ విడుద‌ల అవ్వాలి. దాన్ని కూడా టీమ్ వాయిదా వేసింది.

 

ఈరోజు `పుష్ప‌` నుంచి ఐటెమ్ సాంగ్ కి సంబంధించిన ఓ అప్ డేట్ రావాలి. అది కూడా ఇప్పుడు రావ‌డం లేదు. 6న `పుష్ఫ‌` ట్రైల‌ర్ విడుద‌ల అవ్వాలి. అది కూడా దాదాపుగా వాయిదా ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ సినిమాల‌కు సంబంధించిన కొత్త అప్ డేట్లు.. త్వ‌ర‌లో రావాల్సివుంది. అయితే రేపు `అఖండ‌` ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అవుతోంది. ఈ సినిమా మాత్రం య‌ధావిధిగా రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS