దిల్ రాజు చేతిలో అక్కినేని మల్టీ స్టారర్

మరిన్ని వార్తలు

కింగ్ అక్కినేని నాగర్జున్ తన తనయుడు నాగ చైతన్యతో కలిసి ఒక చిత్రంలో నటించనున్నారట.

ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం, శతమానం భవతి సినిమాతో బంపర్ హిట్ కొట్టి డైరెక్టర్ గా తన సత్తా ఏంటో చూపిన సతీష్ వేగేశ్న ఇప్పుడు ఒక మల్టీ స్టారర్ కి శ్రీకారం చుట్టబోతున్నాడు. నాగార్జున-నాగ చైతన్యని దృష్టిలో పెట్టుకొని ఒక కథ సిద్ధం చేసుకున్నాడట, త్వరలోనే ఇద్దరినీ కలిసి కథ చెప్పబోతునట్టు వినికిడి. దీనికి ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడట!

అంతా అనుకునట్టే జరిగితే ‘మనం’ తర్వాత ఈ ఇద్దరు కలిసి నటించబోయే చిత్రం ఇదే అవుతుంది. ఈ తరంలో మల్టీ స్టారర్ చిత్రాల నిర్మాతగా పేరుతెచ్చుకున్న దిల్ రాజు ఈ అక్కినేని మల్టీ స్టారర్ ని నిర్మించడం గమనార్హం. ఇంకొక ఆసక్తికరమైన విషయమేంటంటే, కొత్త బంగారు లోకంతో హిట్ కొట్టిన శ్రీకాంత్ అడ్డాలతో వెంటనే ఒక మల్టీ స్టారర్ చేయించాడు రాజు. చూద్దాం మరి శ్రీకాంత్ లాగే సతీష్ కుడా సూపర్ హిట్ కొడతాడో లేదో!!

ఇవన్నీ కాకుండా చైతుని తెలుగు తెరకి పరిచయం చేసిన నిర్మాతగా కూడా దిల్ రాజుకి ప్రత్యేకమైన పేరు ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS