కలెక్టర్ కి ౩౦లక్షల చెక్కు అందచేసిన సూపర్ స్టార్ భార్య!

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత మహబూబ్ నగర్ కలెక్టర్ ని స్వయంగా కలిసి ౩౦లక్షల చెక్కుని  అందచేశారు.

వివరాల్లోకి వెళితే, కిందటేడాది మహేష్ మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు మండలంలోని సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అందులో భాగంగానే గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన పాఠశాలకు ఈ ౩౦ లక్షల విరాళాన్ని ఇచ్చారు. అయితే ఇప్పటికే ఈ నూతన కట్టడానికి డిజైన్ సిద్ధంగా ఉంది.

ఇక భవన సముదాయాన్ని త్వరలో పూర్తీ చేయిస్తానని కలెక్టర్ హామీ కూడా ఇచ్చారట. ఈ సందర్భంగా నమ్రత తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సిద్ధాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలపడానికి తన వంతు కృషి చేస్తానని ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇప్పటికే మహేష్ స్వంత గ్రామమైన బుర్రిపాలెంలో వీరు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS