నితిన్ మైండ్ బ్లాక్ చేసిన న‌య‌న్‌

మరిన్ని వార్తలు

న‌య‌న‌తార అంటే టాలీవుడ్ నిర్మాత‌ల‌కు భ‌యం. ఎందుకంటే... పారితోషికంతో హ‌డ‌లు గొట్టేస్తుంటుంది. టాలీవుడ్ లో తొలిసారి కోటి రూపాయ‌లు పారితోషికం అందుకున్న క‌థానాయిక న‌య‌న‌తార‌నే. ఆ త‌ర‌వాతే... హీరోయిన్ల‌కు కోటి ఇవ్వ‌డం మొద‌లైంది. అప్పుడు మొద‌లైన హ‌వా... ఇప్ప‌టి వ‌ర‌కూకొన‌సాగుతూనే ఉంది. తెలుగు సినిమా అనేస‌రికి కోట్ల‌కు కోట్లు పారితోషికం డిమాండ్ చేయ‌డం న‌య‌న‌తారు అల‌వాటుగా మారింది.


తాజాగా నితిన్ సినిమా `అంధాధూన్‌` రీమేక్ కోసం న‌య‌న‌ని సంప్ర‌దించారు. అయితే మ‌రోసారి... నిర్మాత‌ల‌కు పారితోషికం పేరుతో చుక్క‌లు చూపించింది న‌య‌న‌. ఈ సినిమా కోసం ఏకంగా 9 కోట్ల పారితోషికం డిమాండ్ చేసింద‌ట‌. న‌య‌న పారితోషికం ఇప్ప‌టి వ‌ర‌కూ 5 కోట్ల‌లోపే. ఆ మాత్రం ఇవ్వ‌డానికి నిర్మాత‌లు రెడీ అయ్యారు. కానీ న‌య‌న 9 కోట్లు అడిగే స‌రికి బిత్త‌ర‌పోయారు. నితిన్ పారితోషికం 6 కోట్ల లోపే. నితిన్ కంటే న‌య‌న‌కి ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సిరావ‌డం నితిన్‌ని ఇబ్బంది పెట్టే విష‌యమే. దాంతో ఈ సినిమాలో న‌య‌న‌ని ఎంచుకోవాల‌న్న నిర్ణ‌యాన్ని చిత్ర‌బృందం ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS