పద్మావత్ ప్రదర్శిస్తున్న ధియేటర్ల వద్ద విధ్వంసం

మరిన్ని వార్తలు

పద్మావతి నుండి పద్మావత్ కి టైటిల్ మార్చడం అలాగే సినిమాలో ఎవరి మనోభావాలైనా దెబ్బతినేలా సన్నివేశాలు ఉంటాయి అన్న చిన్న అనుమానం కలిగినా ఆ సన్నివేశాలని తొలగించడం వంటివి చేసాక విడుదలవుతున్నది ఈ భారీ చిత్రం.

ఇక ఇన్ని అడ్డంకుల తరువాత విడుదలవుతున్న ఈ చిత్రానికి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్ లో కర్ణిసేన వారు ఒక ధియేటర్ ని టార్గెట్ చేసుకుని విధ్వంసం సృష్టించారు. అక్కడే ఉన్న వాహనాలని కొందరు తగలబెట్టగా ఇంకొంతమంది ఆ ధియేటర్లకి నిప్పు పెట్టారు. దీనితో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది.

పోలీసులు రంగప్రవేశం చేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో- మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ లలో కూడా కర్ణిసేన ఆధ్వర్యంలో హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి.

అయితే సినిమాలో రాజ్ పుత్ ల ప్రతిష్ట దెబ్బతీసేలా ఎటువంటి అంశం కాని సన్నివేశం కానీ లేదు అని పద్మావత్ టీం చెబుతున్నా ఇప్పుడు ఎవరు వినే పరిస్థితిలో లేరు అదే విధంగా సుప్రీమ్ కోర్టు తీర్పుని కూడా వీరు గౌరవించకపోవడం గమనార్హం.. శోచనీయం..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS